అతడు 11 ఏళ్ల వయస్సులోనే కంటిచూపు కోల్పోయాడు. అయినా, అధైర్యపడలేదు. తన వైకల్యం తన కలలకు అడ్డుపడలేదు. బ్రెయిలీ లిపి ద్వారా చదివాడు. పట్టుదలతో ఐఐటీలో సీటుకొట్టాడు. క్యాంపస్ ప్లేస్మెంట్లో మైక్రోసాఫ్ట్ నంచి రూ.51 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొంది, ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. కంటిచూపు లేకపోయినా కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం సాధించి ఔరా అనిపిస్తున్నాడు జార్ఖండ్కు చెందిన సౌరభ్ప్రసాద్.
ఛత్రా జిల్లాలోని తాండ్వా బ్లాక్ చట్టిగాడిలాంగ్ గ్రామానికి చెందిన సౌరభ్ ప్రసాద్ చిన్నతనం నుంచే గ్లాకోమా అనే కంటి వ్యాధితో బాధపడుతున్నాడు. 11 ఏళ్ల వయస్సులో అతడు కంటి చూపును కోల్పోయాడు. కానీ, అతను తన కలలను వదులుకోకుండా ఉన్నత స్థితిలో ఉండేందుకు అన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు. బ్రెయిలీ లిపిలో చదువుకున్నాడు.
సెయింట్ మైఖేల్స్ రాంచీలో ఏడో తరగతి వరకు చదివాడు. అనంతరం ఐబీఎస్ డెహ్రాడూన్లో చేరాడు, అక్కడ నుంచి బోర్డ్ పరీక్షలో 97 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడు. 12వ తరగతిలోనూ 93 శాతం మార్కులు సాధించాడు. మంచి మార్కులతో ఐఐటీ ఢిల్లీలో చేరాడు. ప్రస్తుతం సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్న సౌరభ్ మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ను విజయవంతంగా పూర్తి చేశాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆ కంపెనీ నుంచి రూ.51 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొందాడు.