రాంచీ, మార్చి 19: సార్వత్రిక ఎన్నిక ల వేళ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు ఊహించని షాక్ తగిలింది. జే ఎంఎం అధినేత శిబు సొరేన్ పెద్ద కోడ లు, మాజీ సీఎం హేమంత్ సొరేన్ వ దిన సీతా సొరేన్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి నోద్ తావ్డే, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంచా ర్జ్ లక్ష్మికాంత్ బాజ్పాయ్ సమక్షంలో మంగళవారం ఆమె కాషాయ కండు వా కప్పుకున్నారు. దీనికంటే కొన్ని గంటల ముందు ఆమె జేఎంఎం పా ర్టీకి రాజీనామా ప్రకటించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ, తన భ ర్త దుర్గా సొరేన్ కన్నుమూశాక.. పార్టీ నుంచి తన కుటుంబానికి మద్దతు క రువైందని ఆరోపించారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్న సీతా సొరేన్.. శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనా మా చేశారు.