చైబాస: జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాస జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పులు కొనసాగుతుండగానే నక్సల్స్ ముందే పాతిపెట్టిన మందుపాతరను పేల్చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవాళ మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు సంయుక్తంగా నక్సలైట్ల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా నక్సల్స్ తారసపడటంతో రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. అదే సమయంలో నక్సల్స్ మందుపాతర పేల్చడంతో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.