న్యూఢిల్లీ: జేఈఈ 2024 మెయిన్స్ పేపర్ 2 ఫలితాల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపర్చామని ఎన్టీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా బీఆర్క్, బీప్లాన్ కోర్సుల్లో ప్రవేశాన్ని కల్పించే పేపర్-2 పరీక్షకు సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్, స్కోర్ శాతాన్ని తెలిపే కార్డులను తాజా ఫలితాల్లో విడుదల చేసింది.