ముగిసిన జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 31: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వెలోడ్రమ్ వేదికగా జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. ఆద్యంతం రసవత్తరంగా సాగిన చాంపియన్షిప్లో అండమాన్ నికోబార్ జట్టు ఓవరాల్ విజేతగా నిలువగా, మహారాష్ట్ర రన్నరప్ను కైవసం చేసుకుంది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన అండమాన్ నికోబార్ జట్టు 9 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్య పతకాలు ఖాతాలో వేసుకుంది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఆతిథ్యమివ్వడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, తెలంగాణ సైక్లింగ్ సంఘం చైర్మన్ రాజ్కుమార్, అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ, కోచ్ ట్రెవర్ మ్యాక్స్వెల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: