హైదరాబాద్, ఆట ప్రతినిధి: బోడుప్పల్ వేదికగా 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ అంతర్జిల్లాల కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. తెలంగాణ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కబడ్డీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో పురుషుల, మహిళల జట్లు లీగ్ దశలో నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మ్యాట్పై జరుగుతున్న టోర్నీ రెండో రోజు మ్యాచ్ల్లో నిజామాబాద్ మహిళల జట్టు 56-48 తేడాతో గద్వాల్పై విజయం సాధించగా, ఆదిలాబాద్ 48-25తో భుపాలపల్లిపై గెలిచింది. మరోవైపు పురుషుల విభాగంలో ఆదిలాబాద్ 46-25తో ఖమ్మంపై, రంగారెడ్డి 48-24తో భద్రాద్రి కొత్తగూడెంపై గెలిచి టోర్నీలో ముందంజ వేశాయి.
ఇవి కూడా చదవండి:
ఓవరాల్ చాంప్ అండమాన్ నికోబార్