INDIA alliance | పాట్నా, డిసెంబర్ 7: ఇండియా కూటమి సమావేశాలపై జేడీయూ ఎంపీ సునీల్కుమార్ పింటు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఆ కూటమిలోని పార్టీల్లో ఐక్యత లేదని ఎద్దేవా చేశారు. సీట్ల పంపిణీ విషయంలో పార్టీల మధ్య అవగాహన రానంతవరకూ అది కేవలం స్నాక్స్ సమావేశమేనని చురకలంటించారు. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం వాయిదాపడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పింటు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో విభజనలు లేవని చెప్పారు. అయినప్పటికీ కూటమికి నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్దేనని అన్నారు. నితీశ్కుమార్, అఖిలేశ్యాదవ్, మమతాబెనర్జీ అడుగుతున్నట్టు ఎవరి నాయకత్వంలో 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తారో నిర్ణయించాలని సూచించారు. కేవలం సమోసాలు, చాయ్ తాగేందుకు ఢిల్లీ వచ్చే సమయం ప్రాంతీయ పార్టీల నేతలకు లేదని, వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారని తెలిపారు.