న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో (Manipur Violence) ప్రజలు ఇంకా అభద్రతతో నలిగిపోతున్నారని జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కుకీ, మైతీ తెగల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల్లోనూ ఇంకా అభద్రతాభావం నెలకొందని పేర్కొన్నారు.
మే 3 నుంచి మణిపూర్లో హింసాకాండ చెలరేగినా రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. మణిపూర్లో సాధారణ పరిస్ధితి నెలకొనేలా తాను చేయగలినదంతా చేస్తున్నానని తనను కలిసిన విపక్ష ఎంపీ ప్రతినిధి బృందంతో రాష్ట్ర గవర్నర్ అనసూయ పేర్కొన్నారని చెప్పారు.
అయితే రాష్ట్ర గవర్నర్కు పరిమిత అధికారాలే ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వమే మణిపూర్ అల్లర్లను అదుపు చేసేందుకు చొరవ చూపాలని తాము కోరుతున్నామని అన్నారు. మణిపూర్లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను అంచనా వేసేందుకు 21 సభ్యులతో కూడిన విపక్ష ప్రతినిధుల బృందం రెండు రోజుల పర్యటనకు శనివారం రాష్ట్రానికి చేరుకుంది. ప్రతినిధి బృందం ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్లో రాష్ట్ర గరవ్నర్ను కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించింది.
Read More :
Raj Kundra | నా భార్య పడుకున్నాక మరదలితో పార్టీ చేసుకునే వాడిని.. శిల్పా శెట్టి భర్త సంచలన వ్యాఖ్యలు