మార్చి 10 తర్వాత సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ వేడి అంతా వెళ్లిపోతోందంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి గట్టి కౌంటర్ ఇచ్చారు. యూపీ ప్రజలతో పాటు ఇతర నాలుగు రాష్ట్రాల ప్రజలు కూడా బీజేపీ వేడిని తీసేయడానికి రెడీగా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి కాపాడడానికే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తుడిచిపెట్టేస్తారని జయంత్ చౌదరి పేర్కొన్నారు.
ఇక సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా యోగిపై మండిపడ్డారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ అమృతంలా వుందన్న వ్యాఖ్యలకు అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు. అంటే.. గత బడ్జెట్లన్నీ విషతుల్యమా? అంటూ సూటిగా ప్రశ్నించారు. తనకు కష్టతరమైన ప్రశ్నలు వచ్చినప్పుడు సీఎం యోగి అన్పార్లమెంట్ పదాలను ఉపయోగిస్తారని మండిపడ్డారు. ఇలాంటి అన్ పార్లమెంట్ పదాలు రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవని అఖిలేశ్ స్పష్టం చేశారు.