న్యూఢిల్లీ: స్త్రీ అండంతో సంబంధం లేకుండా కేవలం పురుష కణాలనే అండాలుగా మార్చి మరొకరికి జన్మనివ్వొచ్చని నిరూపించారు జపాన్ శాస్త్రవేత్తలు. పురుష ఎలుక శుక్ర కణాలను సేకరించిన శాస్త్రవేత్తలు వాటిని అండంగా మార్చారు. ఆ అండాన్ని మరో పురుష ఎలుక శుక్రకణంతో ఫలదీకరణ చెందించి ఓ ఎలుకకు ప్రాణం పోశారు. ఇలా వైద్యరంగంలోనే తొలిసారిగా ఒకే లింగానికి చెందినవాళ్లు కూడా పిల్లలకు జన్మనివ్వడానికి అడుగు పడింది.
ఈ విధానం మనుషుల్లో అమలు చేయడానికి 10 ఏండ్లు పట్టొచ్చని పరిశోధన చేసిన శాస్త్రవేత్త హయాషి చెప్పారు.