న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీకి చేరుకుంటారు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ఇండో-పసిఫిక్లో శాంతి, స్థిరత్వం, సహకారం గురించి ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయం కూడా చర్చకువచ్చే అవకాశం ఉన్నది. ఇరు దేశాల మధ్య ఇది 14వ శిఖరాగ్ర సమావేశం. కాగా, ఇద్దరు ప్రధానులు సమావేశమవడం ఇదే మొదటి కావడం విశేషం.
భారత్ జపాన్ మధ్య చివరిసారిగా 2018లో టోక్యోలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. కాగా, 2019లో అప్పటి ప్రధాని షింటో అబే భారత్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ.. పౌరసత్వ చట్టంపై అస్సాంలో నిరసనలు చెలరేగడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక 2020, 2021లో కరోనా కారణంగా ఇరుదేశాల శికరాగ్ర సమావేశాలు జరగలేదు. ఈ ఏడాది సమావేశానికి భారత్ అతిథ్యమిస్తున్నది.