లక్నో : దేశీ స్ట్రీట్ ఫుడ్ను ఇష్టంగా తింటూ సోషల్ మీడియాలో (Viral Video) షేర్ చేస్తుండే ప్రముఖుల్లో భారత్లో జపాన్ రాయబారి హిరోషి సుజుకి ముందువరసలో ఉంటారు. ఆయన ఇటీవల వారణాసిలో పాపులర్ ఫుడ్ ఐటెమ్స్ కచోరి, జిలేబిలను ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సుజుకి ట్విట్టర్లో షేర్ చేశారు.
వారణాసిలో స్ట్రీట్ ఫుడ్ను ఆస్వాదించానని ఈ పోస్ట్కు ఆయన క్యాప్షన్ ఇచ్చారు. కచోరి, సబ్జితో పాటు జిలేబిని ఆరగించిన తర్వాత ఇవి అద్భుతంగా ఉన్నాయనే ఫీలింగ్ కలిగిందని వెరీ గుడ్ అంటూ రాసుకొచ్చారు. ఈ ఏడాది మేలోనూ సుజుకి వారణాసి సందర్శించిన క్రమంలో గోల్ గప్ప, బాటి చొఖ, వారణాసి తాలిని అప్పట్లో ఆయన ఎంజాయ్ చేశారు.
Enjoying street food in Varanasi! pic.twitter.com/xVmNvcOJuw
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 30, 2023
దేశీ ఫుడ్ పట్ల ఆయన ఎంతో ఇష్టాన్ని కనబరచడంతో సుజుకి అనతికాలంలోనే సోషల్ మీడియా సెన్సేషన్గా మారారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయన ఢిల్లీలోని సరోజిని నగర్ మార్కెట్ను సందర్శించి షాపింగ్ చేయడంతో పాటు అక్కడ లభించే ఆలూ టిక్కీని ఇష్టంగా ఆరగించారు.
Read More :