అల్వాల్, మార్చి 31 : మచ్చబొల్లారం డివిజన్ ప్రజలకు వరద ముంపు నుంచి విముక్తి లభించనుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. అల్వాల్ మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని కౌకూరులో సుమారు రూ.6 కోట్ల వ్యయంతో చేపట్టిన బాక్స్నాలా పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1.8 కిలోమీటర్ల పొడవున బాక్స్నాలా నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. ఈ నాలా నిర్మాణం పనులు సుమారు 45 రోజులలో పూర్తి కానున్నాయన్నారు. పనులు పూర్తయితే కౌకూరు నుంచి జనప్రియ వరకు 25 కాలనీలకు ప్రజలు తరుచూ ఎదుర్కొంటున్న ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయని అన్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి సదరు పనులను జూన్ మొదటి వారం నాటికి పూర్తి చేసి స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, ఈఈ రాజు, డీఈ మహేశ్, పారిశుధ్య శాఖాధికారి జలంధర్ రెడ్డి, డీజీఎంం సునీల్, ఏఈలు స్వాతి, అనీల్ టీఆర్ఎస్ నాయకులు జగదీశ్ గౌడ్, శ్రీశైలం, వెంకటేశ్ యాదవ్, మల్లికార్జున్, పరమేశ్, బాబు, రమేశ్ యాదవ్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
అల్వాల్ రైతుబజార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన అల్వాల్ డివిజన్ రాజీవ్ వీకర్ సెక్షన్కు చెందిన బైరుగోని మహేశ్ గౌడ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు బుధవారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించాడు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మచ్చబొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్ తదితరులు పాల్గొన్నారు.