జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ డీజీపీ (జైళ్లశాఖ) హేమంత్ కుమార్ లోహియా (57) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేసే వ్యక్తే ఆయన గొంతు కోసి చంపినట్టు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటన సమయంలో సీనియర్ పోలీస్ అధికారి హత్య కలకలం సృష్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. లోహియా తన ఇంటికి మరమ్మతులు చేస్తుండటంతో జమ్ము శివారులోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారు. డిప్రెషన్లో ఉన్న పనిమనిషి యాసిర్ అహ్మద్ (27) కెచప్ బాటిల్ను పగులగొట్టి లోహియా గొంతు కోసి, బాడీని కాల్చేందుకు యత్నించినట్టు భావిస్తున్నారు. ‘నా జీవితం నాకు నచ్చట్లేదు. ప్రేమ సున్న’ అని యాసిర్ డైరీలో రాసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.