శ్రీనగర్, ఏప్రిల్ 3: జమ్ముకశ్మీర్లో ఇండియా కూటమి విచ్ఛిన్నమైంది. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్టు కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ బుధవారం ప్రకటించారు.
కశ్మీర్లో ఉన్న మూడు లోక్సభ స్థానాల్లోనూ తాము పోటీ చేస్తామని కూటమిలోని మరో భాగస్వామిపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రకటించిన క్రమంలో ముఫ్తీ కూడా తాము సొంతంగానే బరిలో దిగుతామని స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా ప్రకటన తమను తీవ్రంగా నిరాశ పరిచిందని ముఫ్తీ పేర్కొన్నారు. వీరిద్దరి ప్రకటనలో కశ్మీర్ లోయలో ఇండియా కూటమి విచ్ఛిన్నమైనట్టే భావించవచ్చు.