శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ జిల్లాను రెడ్ జోన్గా సోమవారం ప్రకటించారు. మిగతా 19 జిల్లాలను ఆరంజ్ జోన్గా వెల్లడించారు. ఆదివారం శ్రీనగర్లో కొత్తగా 1,126 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా యంత్రాంగం కఠిన నిబంధనలు విధించింది. శ్రీనగర్తోపాటు లఖాన్పుర్, జవహర్ టన్నల్ కంటైన్మెంట్ జోన్లలో 500 మీటర్ల పరిధి వరకు రెడ్ జోన్గా ప్రకటించింది. దీంతో నగరంలో పలు చోట్ల శానిటైజేషన్ డ్రైవ్ చేపట్టారు.
మరోవైపు శ్రీనగర్తోపాటు మరో మూడు జిల్లాల్లో కర్ఫ్యూను గురువారం వరకు పొడిగించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో దీనిని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశమున్నదని చెప్పారు. కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న, కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే ప్రాంతాలను కరోనా రెడ్ జోన్గా ప్రకటిస్తారని వెల్లడించారు.