Pulwama | జమ్మూకశ్మీర్ పుల్వామాలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు, భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు ఆరు కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని ఇష్ఫాక్ అహ్మద్ వానీ అని, పుల్వామాలోని అరిగ్రామ్ ప్రాంత వాసిగా గుర్తించారు. మరో వైపు భద్రతా బలగాలు ఉత్తర కశ్మీర్లో భద్రతను కట్టిదిట్టం చేశాయి. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులు, పేలుడు పదార్థాలను ఒకచోటు నుంచి మరోచోటుకు మారకుండా నిరోధించేందుకు వివిధ చోట్ల ఏర్పాటు చేసిన చెక్పాయింట్ల వద్ద స్నిఫర్ డాగ్లు భద్రతా సిబ్బందికి సహాయం చేస్తున్నాయన్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెలాఖరులో టూరిజంపై జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కశ్మీర్లో జరుగనున్నది. గత ఐదురోజులుగా జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదాలను బలగాలు మట్టుబెట్టాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్కు చెందిన వారిగా గుర్తించారు.