Kachchatheevu : కచ్చతీవు ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్, డీఎంకే లక్ష్యంగా బుధవారం విమర్శలు గుప్పించారు. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించి తమిళ జాలర్లు ఇబ్బందులు ఎదుర్కోవడానికి డీఎంకే కారణమని ప్రధాని మోదీ మండిపడ్డారు. కచ్చతీవుపై ప్రధాని ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తోసిపుచ్చారు.
తమిళనాట ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. వారు చెబుతున్నవన్నీ నిరాధార వ్యాఖ్యలేనని అన్నారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ధరల మంటతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
మన రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నదని, ఇలాంటి వాస్తవ అంశాల గురించి వారు నోరు మెదపరని మండిపడ్డారు. తమిళనాడులో తమకు ఒక్క సీటు కూడా రాదని కాషాయ నేతలకు తెలుసునని అందుకే అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు.
Read More :
Nivedita | కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత.. ప్రకటించిన కేసీఆర్