న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీ జిల్లాలో అదానీ గ్రూపునకు చెందిన బొగ్గు తవ్వకం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల సున్నితమైన అటవీ భూములకు ముప్పు కలిగిస్తుందని, దీని వల్ల 6 లక్షలకు పైగా చెట్లను నరికి వేయవచ్చని ఆయన ఆరోపించారు. బొగ్గు తవ్వకం కార్యకలాపాల కోసం అదానీ పవర్ అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్కు కేంద్ర పర్యావరణ శాఖ 2025 మేలో ఇచ్చిన అనుమతిని రమేశ్ ప్రస్తావించారు.
‘ఈ ప్రాంతం సుమారు 7,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. మైనింగ్ కోసం కేటాయించిన నో-గో జోన్లో భాగంగా పరిగణించారు. ఈ ప్రాజెక్టు కింద 6 లక్షలకు పైగా చెట్లను నరికివేయనున్నారు’