రాయ్పూర్, ఫిబ్రవరి 18: జైన మతానికి చెందిన ప్రఖ్యాత ధర్మకర్త ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ తుదిశ్వాస విడిచారు. చత్తీస్గఢ్లోని డోంగర్గఢ్ తీర్థంలో గత కొన్ని రోజులుగా ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ దీక్షలో ఉన్నారు. దీక్షలో ఉండగానే అనారోగ్యానికి గురయ్యారు. జైన సంప్రదాయం ప్రకారం ఆచార్య సల్లేఖన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఉన్న వారు ఆహార, పానీయాలు ముట్టరు. ఆ విధంగా ఆయన ఆదివారం చివరి శ్వాస వదిలారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించటానికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. నిరుడు డోంగర్గఢ్ తీర్థాన్ని సందర్శించిన ప్రధాని ఆచార్య ఆశీస్సులు అందుకున్నారు.