న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇండోటిబెటన్ బార్డర్ పోలీసులు (ITBP) భారత్-చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టా 17,500 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ మాతాకి జై నినాదాలతో హిమాలయ పర్వతాలు మారుమోగాయి.
#WATCH | Uttarakhand: ITBP personnel celebrate #IndependenceDay at an altitude of 17,500 feet in Uttarakhand pic.twitter.com/Fn17Ndz2UF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 15, 2022
అదేవిధంగా సిక్కింలో సముద్రమట్టానికి 18,800 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. జాతీయ పతాకాన్ని చేతబూని పరేడ్ నిర్వహించారు. మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు.
#WATCH | Sikkim: ITBP jawans celebrate #IndependenceDay at a peak of 18,800 feet in Sikkim pic.twitter.com/vNGmn5eDzQ
— ANI (@ANI) August 15, 2022