చెన్నై: తమిళనాడులో (Tamil Nadu) ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT raids) కలకలం సృష్టించాయి. రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ (Minister Senthil Balaji) నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై (Chennai), కరూర్ (Karur), కోయంబత్తూర్ (Coimbatore)తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలు, ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.
కాగా, మంత్రి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడుల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. కరూర్లో ఆదాయపు పన్ను అధికారులను స్థానికులు, డీఎంకే (DMK) కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ మహిళా అధికారిని మంత్రి నివాసంలోకి వెళ్లకుండా అడ్డగించారు. అధికారులకు సంబంధించిన వాహనాలపై దాడిచేశారు.
గత నెల 24న కూడా ఐటీ అధికారులు తమిళనాడులో దాడులు నిర్వహించారు. రియల్ ఎస్టేట్ కంపెనీ జీ స్క్వేర్కు చెందిన పలు ఆస్తులు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కంపెనీ ఎదగడానికి అధికార డీఎంకే అగ్రనేతలు సహకరించినట్లు ఆరోపణలున్నాయి.https://twitter.com/ANI/status/1661936882933194755?s=20