IT Raid | తమిళనాడులోని కరూర్లో దాదాపు పదిచోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్తో సంబంధాలున్న పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కరూర్లోని రాయనూర్లోని కొంగు మెస్ హోటల్ యజమాని మణి అలియాస్ సుబ్రమణి నివాసంపై సైతం ఐటీ దాడులు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మంత్రి సెంథిల్ బాలాజీ ఉద్యోగాలు ఇప్పించేందుకు డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. అలాగే మనీలాండరింగ్తో పాటు పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్లను ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్ కేసులో జూన్ 14న ఈడీ సెంథిల్ బాలాజీని అరెస్టు చేసింది. ఆ తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తర్వాత జూన్ 15న సెంథిల్ బాలాజీని మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.