న్యూఢిల్లీ: ‘భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అన్నది భారత ఆధునిక చరిత్రలో పెద్ద అబద్ధం. వాస్తవానికి రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కన్నా జవహర్లాల్ నెహ్రూ ప్రముఖ పాత్ర పోషించారు’ అంటూ బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అత్యంత సన్నిహితుడైన సుధీంద్ర కులకర్ణి రాసిన వ్యాసాన్ని కాంగ్రెస్ నేత పిట్రోడా సమర్థించడం సరికొత్త వివాదానికి తెరలేపింది. సుధీంద్ర కులకర్ణి ఓ పత్రికకు రాసిన ఆ వ్యాసం స్క్రీన్షాట్ను ఇటీవల పిట్రోడా తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తూ ఇది అంబేద్కర్ అభిమానులను, దళితులను అవమానించడమేనని మండిపడ్డారు.
పిట్రోడా వైఖరిని కాంగ్రెస్ సమర్థిస్తుందా అంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యమని, కానీ పిట్రోడా వ్యాఖ్యలు ఆయనను కించపరిచే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి దళితులకు, అంబేద్కర్కు వ్యతిరేమని విమర్శించారు. పిట్రోడా రాహుల్ గాంధీకి సన్నిహితుడు, మార్గదర్శకుడని అంటూ.. రాహుల్ భాషనే పిట్రోడా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అయితే తాను చేసిన పరిశోధన ఆధారంగానే ఆ వ్యాసం రాసినట్టు కులకర్ణి వివరించారు. రాజ్యాంగ పీఠికను రూపొందించడంలో అంబేద్కర్కు ఎటువంటి పాత్ర లేదని, అంతా నెహ్రూ రూపొందించిన ముసాయిదానేనని స్పష్టం చేశారు.