ముంబై: బ్యాంకు సిబ్బంది సుమారు 1200 నకిలీ ఖాతాలు తెరిచారు. రూ.53.72 కోట్ల మేర లూఠీ చేశారు. మహారాష్ట్రలోని అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, ఒక బ్రాంచ్లో ఇది బయటపడింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు అక్టోబర్ 27న ఆ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, ఒక బ్రాంచ్తోపాటు చైర్మన్, ఒక డైరెక్టర్ నివాసాల్లో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది.
అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ శాఖలో పాన్ కార్డు వివరాలు లేకుండానే 1200 కొత్త బ్యాంకు ఖాతాలను సిబ్బంది తెరిచారు. కేవైసీ నిబంధనలు కూడా పాటించలేదు. బ్యాంకు ఖాతాలు తెరవడానికి అన్ని ఫారమ్లను బ్యాంక్ సిబ్బందే నింపారు. వాటిపై సంతకాలు, వేలు ముద్రలు కూడా వారే వేశారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) తెలిపింది. దీంతో ఆ బ్యాంకు ఖాతాల్లోని రూ.53.72 కోట్లను సీజ్ చేసినట్లు శనివారం వెల్లడించింది.