తిరుమల: చంద్రయాన్-3 (Chandrayaan-3)మిషన్ను శుక్రవారం ఇస్రో చేపట్టనున్న విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ ద్వారా చంద్రయాన్-3ను ప్రయోగించనున్నారు. అయితే ఆ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుతూ ఇవాళ ఉదయం ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్.. తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్-3 రోవర్.. చంద్రుడిపై దిగుతుందని ఆయన తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఇవాళ తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. చంద్రయాణ్-3 ప్రతిమతో శాస్త్రవేత్తలు ఆలయాన్ని విజిట్ చేశారు.
నేషనల్ అట్మాస్పియరిక్ రీసర్చ్ ల్యాబరేటరీ డైరెక్టర్ అమిత్ కుమార్ పత్రా, చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్ వీరాముత్తు వేల్, అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పనా కాళహస్తితో పాటు ఇతర శాస్త్రవేత్తలు కూడా ఇవాళ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చంద్రుడి అధ్యయనం కోసం ఇస్రో ఈ మిషన్ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే చంద్రుడిపై స్పేస్క్రాఫ్ట్ను దించబోతున్న నాలుగవ దేశంగా ఇండియా రికార్డు క్రియేట్ చేయనున్నది.
#WATCH | Andhra Pradesh | India is all set to launch its 3rd moon mission ‘Chandrayaan-3’ tomorrow at 2:35 PM. I pray that everything goes well and it lands on the moon on August 23 onwards any day: S Somanath, ISRO Chief on the launch of Chandrayaan-3 pic.twitter.com/wMp7NIjifM
— ANI (@ANI) July 13, 2023
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3ను ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా ఈ మిషన్ చేపట్టనున్నారు. రేపటి ప్రయోగం కోసం మరికాసేపట్లో కౌంట్డౌన్ ప్రారంభంకానున్నది.