న్యూఢిల్లీ : భారత ప్రతిష్టాత్మక ‘గగన్యాన్’ మానవ సహిత అంతరిక్షయాత్రలో ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే వ్యోమగాముల క్యాప్యూల్(నౌక) వేగాన్ని నియంత్రించి, సురక్షితంగా భూమికి చేర్చే ప్రధాన పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.
త్వరలో నిర్వహించబోయే గగన్యాన్ తొలి ప్రయోగానికి ముందుగా ఈ ప్రయోగం విజయవంతం కావడం ఈ ప్రాజెక్టు భద్రతా ప్రమాణాలపై మరింత నమ్మకాన్ని పెంచింది. మధ్యప్రదేశ్లోని షియోపూర్లోని ఏరియల్ డెలివరీ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డ్రాప్ జోన్లో ఈ పరీక్ష నిర్వహించారు.