బెంగళూరు, జనవరి 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫ్యుయల్ సెల్ను విజయవంతంగా పరీక్షించింది. జనవరి 1న చేసిన ఈ ప్రయోగంలో భాగంగా.. రసాయన చర్య జరిపిన ఫ్యుయల్ సెల్ కేవలం నీటినే బై ప్రొడక్ట్గా విడుదల చేసిందని ఇస్రో వెల్లడించింది. హైడ్రోజన్, ఆక్సిజన్ నుంచి రసాయన చర్య జరిపి 180 వాట్ల శక్తిని విడుదల చేసిందని తెలిపింది. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లో వాడే విద్యుత్తు ఉత్పత్తి కోసం అభివృద్ధి చేసిన ఈ ఫ్యుయెల్ సెల్ పనితీరుకు సంబంధించిన డాటాను సేకరించామని, దానితో పూర్తిస్థాయి పనితీరును విశ్లేషిస్తామని వెల్లడించింది.
అత్యంత సామర్థ్యం, అతి చవకైన బ్యాటరీని కూడా ఇస్రో పరీక్షించింది. భవిష్యత్తు మిషన్ల కోసం దీన్ని అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ఉపయోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీలకన్నా తక్కువ బరువు, తక్కువ ధర అని వెల్లడించింది. ఇవి 10 ఏహెచ్ సిలికాన్ గ్రాఫైట్ ఆనోడ్ ఆధారిత బ్యాటరీలని వివరించింది.