తిరువనంతపురం : మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లను, మహిళా శాస్త్రవేత్తలను ఇందులో భాగస్వాములను చేస్తామన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర 2025 నాటికి చేపట్టవచ్చన్నారు. మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు మనకు లేరని, అందుకోసం ఎయిర్ఫోర్స్ ఫైటర్ టెస్ట్ పైలట్లను తీసుకుంటామన్నారు. వీరిద్దరికీ కేటగిరీలో స్వల్ప తేడా ఉందన్నారు. అయితే ఒకసారి తీసుకుని శిక్షణ పొందిన తర్వాత అంతా దారిలో పడిపోతుందని అన్నారు.