బెంగళూరు, ఫిబ్రవరి 25: అంతరిక్షంలోకి మానవుడిని పంపేందుకు భారత్ తొలిసారి చేపట్టిన గగన్యాన్ యాత్రలో ఇస్రో మరో ముందడుగు వేసింది. టెస్ట్ వెహికల్(టీవీ)లో అబార్ట్ టెస్టింగ్కు వినియోగించే సిమ్యులేటెడ్ క్రూ మాడ్యుల్ (ఎస్సీఎం)ను ఇస్రో తయారు చేసింది. మొదటిసారిగా దేశీయంగా ఆవిష్కరించిన సిమ్యులేటెడ్ క్రూ మోడల్ను వీఎస్ఎస్సీ అభివృద్ధి చేయగా, హైదరాబాద్కు చెందిన మంజీరా మెషిన్ బిల్డర్స్ తయారు చేసింది. ఇది ఎలాంటి ఒత్తిడి లేని క్రూ మాడల్ అని, ప్యారాచూట్లు, పైరోలకు అనుకూలంగా దీని ఇంటర్ఫేస్ వ్యవస్థ ఉన్నట్టు ఇస్రో అధికారులు తెలిపారు.