న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి వచ్చే వారం ఆయన ఇండియా రావాల్సి ఉంది. అయితే ఆ పర్యటనకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఆదివారం కరోనా పరీక్షలో బెన్నెట్ పాజిటివ్గా తేలారు. ఐసోలేషన్లో ఉన్న ఆయన ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు బెన్నెట్ ఇండియాలో టూర్ చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆయన పర్యటన వాయిదా పడింది.