కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో ఇవాళ ఓ గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఇప్పటి వరకు ఓ సిక్కు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఖోర్షాన్ గ్రూపు అని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఖోరోషన్ ప్రావిన్సుకు చెందిన వాళ్లే కుర్షాన్ ఉగ్రవాదులు. ఆ దేశంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన మిలిటెంట్ సంస్థ ఇది. ఇవాళ ఉదయం గురుద్వారా కర్తే పార్వాన్పై దాడి చేసింది ఈ గ్రూపే అని తేలింది. రెండు సార్లు బాంబు దాడి చేశారు. ఆ తర్వాత సిక్కులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఇస్లామిక్ స్టేట్ ఖోరోషాన్ మిలిటెంట్ గ్రూపును 2015లో స్టార్ట్ చేశారు. ఇరాక్, సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఆధిపత్యంలో ఉన్న సమయంలో ఈ గ్రూపును ప్రారంభించారు. ఈ గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్తో పాటు పాకిస్థాన్ తాలిబన్ సభ్యుల్ని రిక్రూట్ చేస్తారు. ఈ గ్రూపులో సుమారు 3వేల మంది మిలిటెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఖోరోషాన్ ఎక్కువగా రాజకీయవేత్తలు, భద్రతా దళాలు, మైనార్టీ వర్గాలు, అమ్మాయిలు, మెటర్నిటీ వార్డులను టార్గెట్ చేస్తుంటారు. ఇటీవల నుపుర్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. భారత్పై దాడి చేస్తామని కూడా ఈ గ్రూపు వార్నింగ్ ఇచ్చింది.