న్యూఢిల్లీ: జీ-20 సమావేశాలకు సంబంధించి రాష్ట్రపతి ముర్ము పేరిట జారీ అయిన విందు ఆహ్వాన పత్రిక నేపథ్యంలో దేశం పేరును భారత్గా మారుస్తారంటూ ప్రచారం జరుగుతున్నది. అయితే ఇప్పుడు తాజాగా అలాంటి మరో ఆహ్వానం వెలుగులోకి వచ్చింది. బుధ, గురువారాలు ఇండోనేషియాలో జరిగే 20వ ఆసియన్-ఇండియా సమ్మిట్, 18వ ఆసియా సమ్మిట్కు సంబంధించిన నోట్లో ప్రధాని మోదీని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్గానే పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర దీనిని ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ‘చూశారుగా మోదీ ప్రభుత్వం ఎంత గందరగోళంలో ఉందో. విపక్షాలన్నీ ఏకమై ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసుకున్నందుకే ఈ డ్రామా ఆడుతున్నది’ అని జైరాం రమేశ్ విమర్శించారు. కాగా జీ20 సమ్మిట్కు వచ్చే అధికారులు ఐడెంటిటీ కార్డులు కూడా ‘భారత్-అఫీషియల్’ పేరిట ఉన్నాయని కొందరు తెలిపారు.