లక్నో : సామాజిక మాధ్యమాల విస్తృతితో దేశాల మధ్య సరిహద్దులు చెరిగి భిన్న మతాలు, ప్రాంతాలకు చెందిన వారు ప్రేమలో వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ తరహాలో ఇరాన్కు చెందిన ఓ యువతి యూపీలోని మొరదాబాద్కు చెందిన యూట్యూబర్కు దగ్గరయ్యారు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో ఆమె దేశాలను దాటి అతడిని కలుసుకునేందుకు యూపీకి వచ్చింది. యూట్యూబర్ దివాకర్ను కలిసేందుకు 20 రోజుల టూరిస్ట్ వీసాపై ఇరాన్లోని హమెదాన్కు చెందిన ఫైజా (24) భారత్కు వచ్చింది.
న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం వీరిద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫైజా తండ్రి మసూద్ కూడా భారత్కు రాగా వీరంతా తాజ్ మహల్, యూపీలోని అయోధ్యను కూడా త్వరలో సందర్శించనున్నారు. తనకు ఫైజా మూడేండ్ల కిందట ఇన్స్టాగ్రాంలో పరిచయమైందని దివాకర్ చెప్పుకొచ్చారు. తాను ట్రావెల్ వ్లోగ్స్ చేస్తుండటంతో తొలుత తాము ఆయా దేశాల గురించి మాట్లాడుతకున్నామని, ఆపై తమ మధ్య ప్రేమ చిగురించిందని చెప్పారు.
తాను ఫైజాను కలుసుకునేందుకు 2023 జులైలో హమెదాన్ సందర్శించానని దివాకర్ తెలిపారు. ఆ సమయంలో ఇరాన్లో తాము వివాహానికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాలు పూర్తిచేశామని, ఈసారి భారత్లో ఆ లాంఛనాల కోసం ఆమె ఇక్కడకు వచ్చిందని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తవగానే తాము పెండ్లి చేసుకుంటామని దివాకర్ తెలిపారు. తమకు మతాల అంతరాలేమీ లేవని, ఫైజా కూడా తన మతాన్ని ఆచరించవచ్చని చెప్పారు. తొలుత తమ తల్లితండ్రులు అభ్యంతరం తెలిపినా ఇప్పుడు వారు తమ రిలేషన్షిప్ను అంగీకరించారని అన్నారు. ఫైజా నుంచి తాను పెర్షియన్ కొంత నేర్చుకున్నానని, తాను ఫైజాకు హిందీ నేర్పానని తెలిపారు.
Read More :
Singer Mangli | సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం