చెన్నై: పూర్తిగా మెరుగుపర్చిన భద్రత, సౌకర్యాలతో తయారు చేసిన వందే భారత్ స్లీపర్ కోచ్లను చెన్నైలోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) బుధవారం ఆవిష్కరించింది. ఐసీఎఫ్లో 2018 నుంచి తయారవుతున్న వందేభారత్ ఎక్స్ప్రెస్లు దేశ వ్యాప్తంగా 77 వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. అయితే ఇప్పటివరకు తయారు చేసిన వందేభారత్ కోచ్లు కేవలం కూర్చునేందుకు వీలుగా చైర్కార్ సౌకర్యంతోనే నిర్మించారు. అయితే రాత్రి వేళల్లో కూడా దూరప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు వీలుగా పూర్తి ఏసీ కోచ్లతో వందేభారత్ స్లీపర్ కోచ్లను ఐసీఎఫ్ తయారు చేస్తున్నది. ఈ స్లీపర్ కోచ్లలో జీఎఫ్ఆర్పీ ప్యానెల్స్, సుఖవంతమైన కుషన్ ఫోమ్తో బెర్త్లు, వ్యాక్యూమ్ టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేసి ప్రయాణాన్ని సుఖవంతంగా, ఆహ్లాదకరంగా చేయనున్నట్టు అధికారులు తెలిపారు.