న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో ఎన్నో చిత్ర విచిత్ర ఫుడ్ ఎక్స్పరిమెంట్ వీడియోలకు (Viral Video) కొదవేం లేదు. పలు వెరైటీ కాంబినేషన్తో కూడిన ఆహార పదార్ధాల వీడియోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ ప్రతిస్పందన లభిస్తుంది. ఇక లేటెస్ట్గా పార్లే జీ పకోడీ కాంబినేషన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఈ వైరల్ క్లిప్లో ఈ బిస్కెట్లతో ఓ మహిళ పకోడీలను చేయడం కనిపిస్తుంది. బిస్కెట్లపై వెన్న రాసి ఆపై వాటిని మామూలు పకోడీల్లానే నూనెలో వేయిస్తుండటం ఈ క్లిప్లో చూడొచ్చు. ఇక ఉడకబెట్టిన బంగాళాదుంపలతో స్పైసీ మిక్స్చర్ను మహిళ తయారుచేస్తుంది. ఈ స్టఫ్ను రెండు పార్లేజీ బిస్కెట్ల మధ్యలో శాండ్విచ్లా చేస్తుంది.
Gujjus have gone INSANE. pic.twitter.com/7VXRZzjOcP
— 𝐌𝕒𝕟𝕥𝕠™ 𝚏𝚊𝚗 (@Shayarcasm) November 3, 2023
వీటికి వెన్న జోడించి డీప్ ఫ్రై చేస్తుంది. ఆపై చట్నీతో వీటిని సర్వ్ చేస్తుంది. ఈ వీడియోకు పెద్దసంఖ్యలో వ్యూస్ రాగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇదేం కాంబినేషన్ వీరిపై కేసు నమోదు చేయాలని ఓ యూజర్ కామెంట్ చేయగా ఆహా ఏం కాంబినేషన్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Doping Test | డోప్ పరీక్షలో పట్టుబడిన ఒలింపిక్ విజేత