న్యూఢిల్లీ : స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కు వెళ్లి సినిమా ఎంజాయ్ చేయడం ఓ మధురానుభూతిని (Viral Post) అందిస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ఓటీటీల రాకతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయింది. కొత్త సినిమాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫాంలపై రిలీజయ్యే వరకూ చాలా మంది వేచిచూస్తున్న పరిస్ధితి. మరోవైపు కుటుంబ సభ్యులతో థియేటర్కు వెళ్లి సినిమా చూడటం ఖరీదైన వ్యవహారంగా మారడం కూడా ఓటీటీ వైపు జనాలు మళ్లేందుకు ఓ కారణంగా చెబుతున్నారు.
థియేటర్లలో సినిమా టికెట్లతో పాటు ఫుడ్, కూల్డ్రింక్స్ ధరలు కొండెక్కడం కూడా ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడుతోంది. ఇక ఓ థియేటర్లో పాప్కార్న్కు వచ్చిన ఖరీదైన బిల్లును ఓ ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్రిదిప్ కే మండల్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ పోస్ట్ను ఏకంగా 12 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వైరల్ క్లిప్లో థియేటర్లో చీజ్ పాప్కార్న్, పెప్సీలకు వచ్చిన బిల్లు చూసి నెటిజన్లు కంగుతిన్నారు.
Rs 460 for 55gm of cheese popcorn, Rs 360 for 600ml of Pepsi. Total Rs 820 at @_PVRCinemas Noida.
That’s almost equal to annual subscription of @PrimeVideoIN.
No wonder people don’t go to cinemas anymore. Movie watching with family has just become unaffordable. pic.twitter.com/vSwyYlKEsK
— Tridip K Mandal (@tridipkmandal) July 1, 2023
చీజ్ పాప్కార్న్కు రూ. 460 బిల్లు వేయగా, కూల్ డ్రింక్కు ఏకంగా రూ. 360 చార్జ్ చేశారు. మొత్తం రెండు ఐటెమ్స్ బిల్లు రూ. 820 రావడం చూసి షాక్ తినడం త్రిదిప్ వంతైంది. ఇది సినిమా టికెట్లకు అదనం కాగా మొత్తం ఖర్చు రూ. 1000పైమాటే.
ప్రైమ్ వీడియో వార్షిక సబ్స్క్రిప్షన్కు సమానమైన బిల్లు వచ్చిందని ఇది నోయిడాలోని పీవీఆర్ సినిమాస్లో తనకు ఎదురైన అనుభవమని ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకపోవడంలో ఆశ్చర్యం లేదు. కుటుంబంతో కలిసి థియేటర్లో సినిమా చూడటం భరించదగినది కాదని ట్వీట్లో పేర్కొన్నారు.
Read More :