న్యూఢిల్లీ : మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లో హింస, అల్లర్లు జరిగే అవకాశంఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ 15 బెటాలియన్ల ర్యాపిడ్ ఫోర్స్ (RAF)ను సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 20వేల మంది జవాన్లు ఎయిర్లిఫ్ట్కు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని బెటాలియన్లలో అల్లర్లను అడ్డుకునేందుకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన మేరకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వెంట తీసుకెళ్లాలని, అలాగే వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ మేరకు బుధవారం కంపెనీ కమాండర్, కమాండెంట్లకు ప్రత్యేక బుధవారం ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. ఫోర్స్ ఏదైనా నిర్ధిష్ట డ్యూటీ కోసం వాయుమార్గం, రోడ్డుమార్గాల్లో వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తున్నది. ఏ బెటాలియన్లోనూ సైనికుల సంఖ్య తక్కువగా ఉండకూడదని కంపెనీ కమాండర్, కమాండెంట్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు ఇచ్చారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్నది. రోజుకు రోజుకు శివసేన రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్నది. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత గవర్నర్ను కలిసి బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలను శివసేన బెదిరిస్తోందని ఆరోపించారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించారు. మహారాష్ట్రలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని కేంద్ర ఏజెన్సీలు పేర్కొన్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబైకి చేరుకోగానే విధ్వంసం జరిగే అవకాశం ఉందని, దీంతోనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించనున్నట్లు తెలుస్తున్నది.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఓ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఎన్ఐఏ బృందం కూడా ఉదయ్పూర్కు చేరుకుంది. దారుణ హత్య తర్వాత ఉదయ్పూర్లో ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రతల దృష్ట్యా రాజస్థాన్ అంతటా ఇంటర్నెట్ నిలిపివేశారు. ఈ క్రమంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సీఆర్ఎఫ్కి చెందిన ఆర్ఏఎఫ్ బెటాలియన్లు మోహరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.