షిమ్లా: హిమాచల్ప్రదేశ్ ఎక్సైజ్, పన్ను విభాగం అధికారులు బుధవారం పర్వానులోని అదానీ గ్రూప్ సంస్థ గోదాములో జీఎస్టీకి సంబంధించిన తనిఖీలు చేశారు. ఇవి సాధారణంగా జరిగే తనిఖీలేనని ప్రభుత్వ అధికారులు, అదానీ యాజమాన్యం ప్రకటించాయి. కంపెనీ మొత్తం జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో సర్దుబాటు చేసి చూపించారని, చెల్లింపులేవీ నగదు రూపంలో చేయలేదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. నగదు రూపంలో తాము పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని అదానీ కంపెనీ తెలిపింది.