హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దవాఖానల్లో అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లపై (ఫైర్సేఫ్టీపై) పూర్తిస్థాయిలో సమీక్షించాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇటీవల పలు రాష్ర్టాల్లోని దవాఖానల్లో అగ్నిప్రమాదాలు సంభవించి కరోనా రోగులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి అగ్నిప్రమాదాలు జరుగడానికి యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయని, కాబట్టి వెంటనే సమీక్షించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ర్టాలకు లేఖ రాశారు.