ముంబై : సముద్ర జలాల్లో భారత నావికాదళం బలం మరింత పెరుగనున్నది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నాల్గో స్కార్పెన్ క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ (INS) వెలాను భారత నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారు. కార్యక్రమం గురువారం ముంబైలో జరుగనున్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ వెలా కమాండింగ్ ఆఫీసర్ అనిష్ మాథ్యూ మాట్లాడుతూ వెలాను నావికాదళంలో ప్రవేశపెట్టడం అందరికీ గర్వకారణమన్నారు. సబ్ మెరైన్లోని బ్యాటరీ, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెప్పారు. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ప్రభావానికి అడ్డుకట్ట వేయడంలో ఈ చర్య కీలకమైందిగా భావిస్తున్నారు. ఇంతకు ముందు ఈ నెల 21న గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను నేవీ తన అమ్ములపొదిలోకి చేర్చింది.