న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి 32 ఏండ్ల పాటు సేవలందించిన ఐఎన్ఎస్ ఖుక్రీకి విరామం ఇచ్చారు. స్వదేశీయంగా నిర్మించిన క్షిపణి కొర్వెట్లలో తొలిదైన ఈ యుద్ధ నౌక డీకమిషన్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1989 నుంచి 2021 వరకు 28 మంది కమాండింగ్ ఆఫీసర్లు ఐఎన్ఎస్ ఖుక్రీని కమాండ్ చేశారు. 32 ఏండ్లపాటు నేవీకి అమూల్యమైన సేవలందించిన ఈ యుద్ధ నౌక ఇప్పటి వరకు 6,44,897 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించిందని ఇండియన్ నేవీ పేర్కొంది.