న్యూఢిల్లీ: సముద్రపు దొంగలు హైజాక్ చేసిన కార్గో షిప్ పైకి ఇండియన్ నేవీ మెరైన్ కమాండోలు చేరుకున్నారు. (Navy Marine Commandos) వెంటనే ఆ ఓడను వీడి వెళ్లాలని సముద్రపు దొంగలను హెచ్చరించారు. భారతీయ సిబ్బందిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. లైబీరియాకు చెందిన కార్గో షిప్ ‘ఎంవీ లీలా నార్ఫోక్’ను సోమాలియా తీరం సమీపంలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. అందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై స్పందించింది. హైజాక్ అయిన కార్గో షిప్ను అనుసరించి సొమాలియా తీరానికి చేరింది. ఆ వెంటనే మెరైన్ కమాండోలు రంగంలోకి దిగారు. హైజాక్ చేసిన ఆ ఓడను విడిచి వెళ్లాలని హెలికాప్టర్ ద్వారా సముద్ర దొంగలను హెచ్చరించారు.
అనంతరం కార్గో షిప్ ‘ఎంవీ లీలా నార్ఫోక్’ పైకి మెరైన్ కమాండోలు దిగారు. 15 మంది భారతీయ సిబ్బందితోపాటు మిగతా వారిని సముద్ర దొంగల బారి నుంచి కాపాడేందుకు మెరైన్ కమాండోలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. కార్గో షిప్లోని సిబ్బంది సేఫ్ జోన్లో ఉన్నట్లు పేర్కొంది.