Chandigarh | ఛండీగఢ్: పందెం బరిలో గాయపడిన ఒక కోడికి పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రక్షణ కల్పించడమే కాకుండా గాయపడిన ఆ కోడికి చికిత్స అందించి, ఆహారం కూడా పెడుతున్నారు. పంజాబ్లోని బఠిండా జిల్లా బలువానా గ్రామంలో అక్రమంగా కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పందెం బరిలో గాయపడిన రెండు కోళ్లను దవాఖానకు తరలించగా.. ఒకటి చనిపోయింది. మరోదానిని కాపాడిన పోలీసులు.. దాన్ని నిందితులకు వ్యతిరేక సాక్ష్యంగా కోర్టుకు తీసుకెళ్తామని చెప్పారు.