బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karntaka Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకులు నారాయణ మూర్తి (Narayana Murthy), ఆయన సతీమణి సుధా మూర్తి (Sudha Murty) ఓటు వేయడానికి బెంగళూరులోని పోలింగ్ స్టేషన్కు వచ్చారు. సాధారణ ఓటర్లతోపాటు నాయరాయణ మూర్తి కూడా లైన్లో నిలబడి ఓటువేశారు. అనంతరం మాట్లాడుతూ.. మొదట మనం ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ఆ తర్వాతే మంచి చెడు గురించి మాట్లాడాలి. ఓటేయనివారికి విమర్శించే హక్కు లేదని చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటేయాలని సూచించారు.
"First, we vote and then we can say this is good, this is not good but if we don't do that then we don't have the right to criticise," says Infosys founder Narayana Murthy after casting his vote in Bengaluru#KarnatakaElections pic.twitter.com/BAuZXKUzVs
— ANI (@ANI) May 10, 2023
తమని ఒకసారి చూడండి.. మృద్ధులమైన మేము ఉదయాన్నే 6 గంటలకే ఓటు వేయడానికి వచ్చామని సుధా మూర్తి అన్నారు. తమను చూసి యువ ఓటర్లు నేర్చుకోవాలని సూచించారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో భాగమని చెప్పారు.
#WATCH | Jayanagar, Bengaluru | Sudha Murty gives a message to young voters after casting her vote; says, "Please look at us. We are oldies but we get up at 6 o'clock, come here and vote. Please learn from us. Voting is a sacred part of democracy…"#KarnatakaElections pic.twitter.com/B1ecZCH93M
— ANI (@ANI) May 10, 2023
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బెంగళూరు శాంతినగర్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రశాంతంగా ఉండాలంటే అది మనకు చాలా అవసరం అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. సీఎం బసవరాజ్ బొమ్మై హుబ్లీలో, షికారిపురలో మాజీ సీఎం యడియూరప్ప, బెంగళూరులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు జీ.పరమేశ్వర తముకూరులో, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని బెంగళూరులో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
#WATCH | #KarnatakaElections | Co-founder of Infosys, Nandan Nilekani casts his vote at a polling booth in Koramangala, Bengaluru. pic.twitter.com/OyF4iTUsSx
— ANI (@ANI) May 10, 2023