మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో ఘటన
భోపాల్, జూన్ 25: వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ నవజాత శిశువు పురిట్లోనే చనిపోయింది. ఛత్తర్పూర్ జిల్లాలోని నౌగావ్కు చెందిన ఓ మహిళకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. దగ్గర్లోని కమ్యూనిటీ సెంటర్కు వెళ్లగా ఆమెను దవాఖానలో చేర్చుకోలేదు. వేరే ఎక్కడికీ పంపలేదు.
ఆరు గంటల పాటు ఆ మహిళ పురిటి నొప్పులతోఅక్కడే దవాఖాన బయట నేలపైనే ఉండిపోయింది. తర్వాత, కమ్యూనిటీ సెంటర్ అధికారులు మహిళను జిల్లా దవాఖానకు వెళ్లాలని సూచించారు. మార్గమధ్యలోనే మహిళ ప్రసవించింది. అప్పటికే ఆ శిశువు చనిపోయింది. దీనిపై మధ్యప్రదేశ్ మానవ హక్కుల కమిషన్(యూఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. జిల్లా కలెక్టర్, జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎంహెచ్వో)లకు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా రిపోర్టు అందించాలని ఆదేశించింది. ఆమెకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.