Madhya Pradesh | ఇండోర్, అక్టోబర్ 26: మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పరమానంద్ తొలాని అలియాస్ ఇండోరి ధార్తి పకడ్ది ఆసక్తికరమైన ఉదంతం. 60 ఏండ్లు దాటిన తొలాని ఇంతవరకు 18 సార్లు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే కనీసం డిపాజిట్ రాకపోయినా తన ప్రయత్నం మాత్రం మానలేదు. ఈసారి ఆయన ఇండోర్ జిల్లా సన్వేర్ నుంచి 19వ సారి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
తానేదో ఎన్నికల్లో విజయం సాధించి పదవి చేపట్టాలన్న ఆశ లేదని, ఇలా ఎన్నికల్లో పోటీ చేయడం కుటుంబ సంప్రదాయంగా వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తన తండ్రి మరణించే వరకు 1950 నుంచి 1988 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని చెప్పారు.