న్యూఢిల్లీ, జూలై 17: దేశంలో అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో వరుసగా ఎనిమిదోసారి ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
సూపర్ స్వచ్ఛ్ లీగ్ అవార్డు క్యాటగిరీ కింద మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరోసారి ప్రథమ స్థానంలో నిలువగా, తర్వాతి స్థానంలో సూరత్, నవీ ముంబై ఉన్నాయి.