డెహ్రాడూన్: తల్లీకొడుకులైన మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు ప్రమాదాలేనని ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి అన్నారు. బలిదానాలపై గాంధీ కుటుంబానికి గుత్తాధిపత్యం ఏమీలేదని విమర్శించారు. తమ నానమ్మ, తండ్రి దేశంకోసం బలిదానం చేశారన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. బలిదానం అంటే భగత్సింగ్, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్లదని చెప్పారు. వారు దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు వదిలారన్నారు. గాంధీల కుటుంబంలో జరిగింది ప్రమాదం మాత్రమేనని పేర్కొన్నారు. బలిదానానికి, ప్రమాదానికి చాలా వ్యత్యాసం ఉదని వెల్లడించారు. రాహుల్ గాంధీ తెలివితేటలు చూస్తే తనకు జాలేస్తుందన్నారు.
భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్లో రాహుల్ గాంధీ సభ ప్రశాంతంగా ముగియడానికి ప్రధాని మోదీయే కారణమని చెప్పుకొచ్చారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దుచేయడంతోనే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. లేకపోతే రాహుల్ గాంధీ.. లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగురవేసి ఉండేవారు కాదని వెల్లడించారు. కానీ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ.. జమ్ములో ఉధ్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడే అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారని పేర్కొన్నారు.