న్యూఢిల్లీ : ఇండిగో విమానాన్ని గౌహతి విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమానశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలెట్స్ విమానాన్ని మళ్లీ విమానాశ్రయానికి తిరిగి తీసుకువచ్చారు. ఆ తర్వాత ప్రయాణికులందరినీ మరో విమానంలో ఢిల్లీకి తరలించామని, విమానాన్ని తనిఖీ చేస్తున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది. ఇండిగో ఎయిర్బస్ A320neo (VT-ITB) గౌహతి-ఢిల్లీ నుంచి 6E 6394 విమానాన్ని నడుపుతోంది.
టేకాఫ్ తర్వాత పక్షి ఢీకొట్టడంతో గౌహతి విమానాశ్రయానికి మళ్లించారు. ఇలాంటి ఘటనలు ఒకే రోజు మూడు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు జబల్పూర్కు వెళ్లే స్పైస్జెట్ విమానం 6వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ఢిల్లీ విమానాశ్రయంలో దింపారు. మధ్యాహ్నం స్పైస్జెట్ బోయింగ్ 737 సుమారు 185 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అత్యవసర పాట్నా విమానాశ్రయంలో దింపివేశారు.